byసూర్య | Tue, Dec 05, 2023, 08:47 AM
పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపు గడువును పెంచినట్లు నాగర్ కర్నూలు డీఈవో గోవిందరాజులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2024 మార్చిలో జరగబోయే పదో తరగతి రెగ్యులర్ పరీక్షకు, ఒకేషనల్ సర్టిఫికెట్ కోసం ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల విద్యార్థులు ఈనెల 7లోగా ఎటువంటి అపరాధ రుసుం లేకుండా ఫీజు చెల్లించొచ్చన్నారు. రూ. 50 అపరాధ రుసుంతో 14వ తేదీ, రూ. 200తో 21వ తేదీ, రూ. 500తో జనవరి 3వ తేదీలోగా ఫీజు చెల్లించాలన్నారు.