byసూర్య | Tue, Dec 05, 2023, 08:44 AM
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండలం అమ్మాపూర్ కురుమూర్తి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిసాయి. గతనెల 18వ తేదీన స్వామివారికి అలంకరించిన ఆభరణాలను సోమవారం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి, వాటిని లెక్కించిన అనంతరం దేవాదాయ శాఖ అధికారులకు అందజేశారు. కొండ దిగువ వరకు భక్తులు గోవిందా స్మరణతో తీసుకువచ్చిన అనంతరం బ్యాంకుకు తరలించి భద్రపరిచారు. జాతర మరో పది రోజులపాటు సాగనుంది.