byసూర్య | Tue, Dec 05, 2023, 09:13 AM
భార్యను వేధించిన కేసులో భర్త కొమ్ము సుధాకర్ కు ఏడాది జైలుశిక్ష, రూ. 10వేల జరిమానా విధిస్తూ ఖమ్మం మొబైల్ కోర్టు ఇన్చార్జ్ న్యాయాధికారి ఆర్. శాంతిలత సోమవారం తీర్పు చెప్పారు. ఖమ్మం ఎన్ఎస్టీ రోడ్ ప్రాంతానికి చెందిన వెంకటలక్ష్మికి నిందితుడు సుధాకర్ తో వివాహం జరిగింది. వీరికి ఒక పాప ఉంది. అయితే తన భర్త ఏ పనీ చేయకుండా నిత్యం తాగొచ్చి అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని 2016 జనవరి 22న ఫిర్యాదు చేసింది.