గెలిచిన ఉత్సాహంలో కాంగ్రెస్ పార్టీ ఏడో గ్యారెంటీ

byసూర్య | Mon, Dec 04, 2023, 10:57 PM

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయానికి ఆరు హామీలు ఎంత దోహదం చేశాయో తెలిసిందే. మేనిఫెస్టో రిలీజ్ చేయడానికి ముందుగానే ఈ ఆరు హామీలను కాంగ్రెస్ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. తాము అధికారంలోకి వస్తే కచ్చితంగా ఈ హామీలను అమలు చేస్తామని ప్రకటించింది. అందుకే వాటికి గ్యారెంటీలని పేరు పెట్టింది. కర్ణాటక తరహాలో ఈ ఆరు గ్యారెంటీల గురించి విస్తృతంగా ప్రచారం చేసి ఇక్కడ కూడా అధికారంలోకి రాగలిగింది. అయితే ఈ ఆరు గ్యారెంటీలే కాదు ఏడో గ్యారంటీని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ప్రజాస్వామ్యబద్ధమైన పాలన అందిస్తామని హామీ ఇచ్చింది. ఎన్నికల్లో గెలిచిన అనంతరం రేవంత్ రెడ్డి ఇదే విషయం గురించి ట్వీట్ చేశారు. తమ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణలో రాజీ పడబోమని ప్రజలకు మరోసారి మాట ఇస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ప్రతిపక్ష పార్టీలను కూడా సమన్వయం చేసుకుని అభివృద్ధిలో రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలుపుతామన్నారు.


బీఆర్ఎస్ పాలనలో కుటుంబ పాలన సాగిందని.. ప్రజల అభిప్రాయాలకు విలువ లేకుండా పోయిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి రాగానే పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను లాగేసుకుంది. కాంగ్రెస్ పార్టీని నిర్వీ్ర్యం చేసేలా కేసీఆర్ అడుగులు పడ్డాయి. కానీ హస్తం పార్టీ బలంగా పుంజుకుంది. గతంలో బీఆర్ఎస్ చేసిన పనినే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తుందా..? బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలను లాగేస్తుందా? అనే చర్చ నడుస్తోంది. ఇప్పటికే భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిశారు. దీంతో ఆయన కాంగ్రెస్‌లోకి జంప్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. మరికొందరు బీఆర్ఎస్ నేతలు సైతం కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఒక పార్టీ తరఫున గెలిచి మరో పార్టీలోకి ఫిరాయించడం అనేది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం.


బీఆర్ఎస్ హయాంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లాగేసే సమయంలో పార్టీ ఫిరాయింపులు వర్తించకుండా కేసీఆర్ జాగ్రత్తపడ్డారు. ఫిరాయింపుల చట్టం దీనికి వర్తించకుండా చూసుకున్నారు. అయితే ప్రజాస్వామ్య స్ఫూర్తి కోణంలో చూస్తే ఇది సరైంది కాదు. ఇప్పుడు ప్రజాస్వామ్య విలువలతో పాలన సాగిస్తామని, ప్రతిపక్షాలను సమన్వయం చేసుకొని పాలన చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. నిజంగా కాంగ్రెస్ ప్రజాస్వామ్య బద్ధంగా పాలన చేయలిగితే అది గొప్ప విషయమే అవుతుంది. కానీ ఇదసలే కొనుగోళ్ల కాలం. ఎప్పుడు ఎవరు పార్టీని చీలుస్తారో, ఏ ప్రభుత్వం పడిపోతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి. అలాంటప్పుడు కాంగ్రెస్ దూకుడుగా వ్యవహరిస్తుందా..? లేదంటే అలాంటి పనులకు దూరంగా ఉంటుందా..? అనేది కాలమే నిర్ణయిస్తుంది.


Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM