byసూర్య | Mon, Dec 04, 2023, 10:45 PM
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమి నేపథ్యంలో బీజేపీ నేత జితేందర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉండి ఉంటే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేదని, ఇప్పటికైనా బండి సంజయ్ని తిరిగి అధ్యక్షునిగా చేస్తే రాబోయే మూడు నాలుగు నెలలలో జరిగే లోక్ సభ ఎన్నికల్లో 10 సీట్లను బీజేపీ తప్పకుండా గెలుస్తుందని ఆయన అన్నారు. తెలంగాణలో ఒకసారి బీజేపీకి అధికారం వచ్చేవరకు బండి సంజయ్నే రాష్ట్ర అధ్యక్షునిగా ఉంచుదామని సూచించారు. బీజేపీకి తెలంగాణలో హైప్ను తీసుకువచ్చింది ఆయనే అన్నారు. కేసీఆర్ పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, బీఆర్ఎస్ను ఇంటికి పంపించాలని నిర్ణయించుకున్నారని, కానీ బండి సంజయ్ని తొలగించడంతో ప్రజలు క్రమంగా కాంగ్రెస్ వైపు మరలినట్లు చెప్పారు. తొలుత బీఆర్ఎస్కు బీజేపీ ప్రత్యామ్నాయమని భావించారని, బండి సంజయ్ తొలగింపు తర్వాత కాంగ్రెస్ వైపు చూశారన్నారు.