byసూర్య | Sun, Dec 03, 2023, 10:58 AM
తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఆ పార్టీ అభ్యర్థులు తొలి రౌండ్ ఫలితాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం 63 స్థానాల్లో కాంగ్రెస్, 40 స్థానాల్లో బీఆర్ఎస్, బీజేపీ 6 స్థానాల్లో, ఎంఐఎం 6 స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి.
మహేశ్వరం నాలుగో రౌండ్ ముగిసే సరికి బీఆర్ఎస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డికి 1272 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇబ్రహీంపట్నంలో మూడో రౌండ్ పూర్తయ్యే సరికి కాంగ్రెస్ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డికి 5395 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. చేవెళ్ల అసెంబ్లీ ఓటింగ్ కౌంటింగ్ అప్డేట్స్ మూడో రౌండ్ ముగిసే సమయానికి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాలే యాదయ్య 2079 ఆధిక్యంలో ఉన్నారు.