byసూర్య | Sun, Dec 03, 2023, 11:02 AM
తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఆ పార్టీ అభ్యర్థులు తొలి రౌండ్ ఫలితాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం 62 స్థానాల్లో కాంగ్రెస్, 42 స్థానాల్లో బీఆర్ఎస్, బీజేపీ 8 స్థానాల్లో, ఎంఐఎం 4 స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి.
మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హవా కొనసాగుతోంది. మూడో రౌండ్ పూర్తయ్యేసరికి తన ప్రత్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిపై 3,658 ఆధిక్యంలో ఉన్నారు. మునుగోడులో మూడో రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి 13,775 ఓట్లు రాగా బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి 10,117 ఓట్లు, బీజేపీ అభ్యర్థి కృష్ణారెడ్డికి 6,709 ఓట్లు వచ్చాయి.