3వ రౌండ్: కామారెడ్డి, కొడంగల్ లో రేవంత్ రెడ్డి ఆధిక్యం

byసూర్య | Sun, Dec 03, 2023, 10:24 AM

తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఆ పార్టీ అభ్యర్థులు తొలి రౌండ్ ఫలితాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం 65 స్థానాల్లో కాంగ్రెస్, 39 స్థానాల్లో బీఆర్ఎస్, బీజేపీ 5 స్థానాల్లో, ఎంఐఎం 1 స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి. కొండగల్, కామారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి అధిక్యం కనబర్చడంతో రేవంత్ ఇంటివద్దకు భారీగా అభిమానులు, కార్యకర్తలు చేరుకుంటున్నారు. దీంతో రేవంత్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. 3 రౌండ్లు ముగిసే సరికి కామారెడ్డి, కొడంగల్ లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కల్వకుర్తిలో కాంగ్రెస్ అభ్యర్థి 3 వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో ఉన్నారు.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM