byసూర్య | Sun, Dec 03, 2023, 10:22 AM
స్వయానా ప్రభుత్వ అధినేత కామారెడ్డిలో దెబ్బతినడం ఖాయమైంది. గజ్వేల్ లో కూడా స్వల్ప ఆధిక్యత ఉందని తెలుస్తున్నా, కనీసం అదొక్కటైనా నిలబెట్టుకోకపోతే పూర్తిగా పరువు పోవడం ఖాయం.రాజస్థాన్, మధ్యప్రదేశ్ లలో కనీసం ఒక రాష్ట్రమైనా కాంగ్రెస్ కి రాకపోవడానికి అంతర్గత కుమ్ములాటలు, నాయకత్వ లోపమే కారణం అని స్పష్టంగా తెలుస్తోంది. ఛత్తీస్ ఘడ్ కూడా ఏమంత లాండ్ స్లైడ్ కానేకాదని అర్థమవుతోంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కాంగ్రెస్ 57 స్థానాల్లో ముందంజలో ఉండగా.. BRS 37 స్థానాలు, BJP 8 స్థానాలు, MIM, ఇతరులు చెరో స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి. ఎల్బీనగర్ BRS అభ్యర్థి సుధీర్రెడ్డి, కొడంగల్, కామారెడ్డిలో రేవంత్ రెడ్డి(కాంగ్రెస్), హుజూరాబాద్లో BRS అభ్యర్థి కౌశిక్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ములుగు నియోజకవర్గంలో సీతక్క ముందంజలో ఉంది. బీఆర్ఎస్ అభ్యర్ది వెనుకంజలో ఉన్నారు. సీతక్క ఇంటికి ఇప్పటికే అభిమానులు చేరుకుంటున్నారు.