byసూర్య | Sat, Dec 02, 2023, 03:37 PM
ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్ పరిధిలోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు.
ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ల వద్ద సీఆర్పీఎఫ్ భద్రతా బలగాలు, కౌంటింగ్ కేంద్రాల్లో ఆర్మ్డ్ రిజర్వుడు పోలీసు బలగాలు, బయట సివిల్ పోలీసులతో పక డ్బందీ బందోబస్తు ఏర్పాటుచేశారు. సోమవారం ఉదయం 6గంటల వరకు కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ ను అమలు చేస్తున్నారు. ఆదివారం ఉదయం 8గంటల నుంచి కౌంటింగ్ మొదలుకానుంది.