byసూర్య | Sat, Dec 02, 2023, 11:41 AM
కర్నాటక డిప్యూటి సీఎం, కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ శనివారం హైదరాబాద్కు రానున్నారు. తెలంగాణ కౌంటింగ్ సరళిని డీకే పరిశీలించనున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరూ అలెర్ట్గా ఉండాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఫలితాల తర్వాత అవసరమనుకుంటే ఎమ్మెల్యేలను క్యాంప్కు పంపాలనే యోచనలో కాంగ్రెస్ ఉన్నట్టు తెలుస్తోంది.
అయితే రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ నేతల బృందం కాసేపట్లో.. తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్(సీఈవో) వికాస్ రాజ్ను కలవనుంది. ఎన్నికల ఫలితాలు వెలువడే సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వ లావాదేవీలపై విజిలెన్స్ నిఘా పెట్టాలని సీఈవో దగ్గర ప్రస్తావించనుంది. రైతు బంధు నిధులు మళ్లింపు అంశంతో పాటు HYD చుట్టుపక్కల ఉన్న అసైన్డ్ భూముల్ని ఇతరుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసే అంశంపై ఫిర్యాదు చేయనుంది.