byసూర్య | Sat, Dec 02, 2023, 11:38 AM
కర్నాటక డిప్యూటి సీఎం, కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ శనివారం హైదరాబాద్కు రానున్నారు. తెలంగాణ కౌంటింగ్ సరళిని డీకే పరిశీలించనున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరూ అలెర్ట్గా ఉండాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఫలితాల తర్వాత అవసరమనుకుంటే ఎమ్మెల్యేలను క్యాంప్కు పంపాలనే యోచనలో కాంగ్రెస్ ఉన్నట్టు తెలుస్తోంది.
తెలంగాణలో అధికారం దక్కేదెవరికి. మరి కొద్ది గంటల్లో ప్రజలు ఎవరికి పట్టం కట్టారనేది తేలి పోనుంది. ఇప్పటికే మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కు అనుకూలంగా అంచనాలు వెల్లడించాయి. ఇప్పటికీ బీఆర్ఎస్ ఎగ్టాక్జ్ పోల్స్ లో తమదే విజయమని ధీమాగా కనిపిస్తోంది. హంగ్ వస్తుందనే చర్చ వినిపిస్తోంది. దీంతో, కాంగ్రెస్ హైకమాండ్ అలర్ట్ అయింది. డీకే శివకుమార్ ను రంగంలోకి దించింది. ఫలితాలు..కేసీఆర్ వ్యూహాల పై డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేసారు.తెలంగాణలో కేసీఆర్ ఇప్పటికే కొంతమంది కాంగ్రెస్ నేతలకు టచ్లోకి వచ్చారని చెప్పారు. అయితే, కాంగ్రెస్ నేతలను కేసీఆర్ లాక్కోవడం ఈసారి కుదరదని తేల్చిచెప్పారు. తెలంగాణ, మధ్యప్రదేశ్లో గెలిచే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బెంగళూరులోని రిసార్టులకు తరలించే ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎవరూ కొనలేరని వారంతా పార్టీకి విధేయులని తెలిపారు.