byసూర్య | Sat, Dec 02, 2023, 11:50 AM
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండల పరిధిలో విద్యుదాఘాతంతో ఓ కూలీ మృతి చెందిన సంఘటన జరిగింది. అమీన్పూర్ పరిధిలో ఉన్న అవంతి ప్రైడ్ సంస్థలో ఒడిశాకు చెందిన సత్యభ్రాత్ చంద్ర పనిచేస్తున్నాడు. నవంబర్ 30న విద్యుత్ బాక్స్ నుంచి మిషన్కు సంబంధించిన వైర్ తొలగిస్తుండగా విద్యుత్ షాక్ తగిలి మృతి చెందాడు. తండ్రి శీతాకాంత్ శుక్రవారం ఫిర్యాదు చేయగా కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.