byసూర్య | Sat, Dec 02, 2023, 08:49 AM
నేషనల్ మీన్స్ కంమెరిట్ స్కాలర్షిప్ అర్హత పరీక్ష ఈ నెల 10న నిర్వహించనున్నట్లు కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా విద్యాధికారి (డీఈవో) అశోక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్కాలర్షిప్ అర్హత పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఆన్లైన్లో హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ఈ నెల 10న ఉదయం 9. 30 గంటల నుంచి మధ్యాహ్నం 12. 30 గంటల వరకు పరీక్ష కొనసాగుతుందని తెలిపారు.