byసూర్య | Sat, Dec 02, 2023, 08:46 AM
అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోయి నష్టపోయిన తమను అధికారులు ఆదుకోవాలని ఖానాపూర్ నియోజకవర్గంలోని పలు మండలాల రైతులకు కోరుతున్నారు. నియోజకవర్గంలో ఇటీవల అకాల వర్షాలు పడడంతో ఎండకు ఆరబోసిన వరి ధాన్యం తడిసిపోయింది. అయితే అధికారులందరూ ఎలక్షన్ విధులలో ఉండడం, ఎన్నికల కోడ్ కారణంగా పంట నష్టంపై సర్వే చేపట్టలేదని వారు వాపోయారు. వ్యవసాయ అధికారులు స్పందించి పంట నష్టంపై సర్వే చేపట్టి ఆదుకోవాలని ఆ మండలాల రైతులు కోరారు.