byసూర్య | Sat, Dec 02, 2023, 08:43 AM
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం కారేపల్లి మండలంలో జరిగింది. ఎస్సై పుష్పాల రామారావు తెలిపిన వివరాలు ప్రకారం బాజుమలైగూడానికి చెందిన దోమందుల సుధాకర్ (43) గ్రామ శివారులోని జమాయిల్ తోటలో జంతువుల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్తు తీగ తగిలి మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై రామారావు పేర్కొన్నారు.