byసూర్య | Sat, Dec 02, 2023, 08:41 AM
బిజెపి రాష్ట్ర కార్యవర్గ ప్రత్యేక ఆహ్వానితుడిగా రంజిత్ మోహన్ ని నియమించారు. ఈ మేరకు రాష్ట్ర బిజెపి ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి నియామక పత్రాన్ని శుక్రవారం అందజేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన రంజిత్ మోహన్ పార్టీలో నీతి నిజాయితీగా అందిస్తున్న సేవలను పార్టీ అధిష్టానం గుర్తించింది. ఈ సందర్భంగా రంజిత్ మోహన్ మాట్లాడుతూ, తమకు అప్పగించిన పదవికి తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.