byసూర్య | Sat, Dec 02, 2023, 08:39 AM
బాన్సువాడ నుండి శబరిమలైకి నాచారం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ మధుసూదన స్వామి ఆధ్వర్యంలో చేపట్టిన మహా పాదయాత్ర కార్యక్రమంలో భాగంగా శ్రీ షిరిడి సాయిబాబా ఆశ్రమం నందు పిట్లంకు చెందిన ఈశ్వర్ రెడ్డి గురు స్వామి పాదయాత్రతో విచ్చేసిన అయ్యప్ప స్వాములకు శుక్రవారం భిక్ష కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మహా బిక్ష కార్యక్రమంలో బాన్సువాడ, బిచ్కుంద, పిట్లం, నిజాంసాగర్ మండలాలకు చెందిన అయ్యప్ప స్వాములు పాల్గొనడం జరిగింది.