byసూర్య | Sat, Dec 02, 2023, 08:38 AM
తెలంగాణ కోసం అమరుడైన పోలీస్ కిష్టయ్య 14వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం పిట్లం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద పోలీస్ కిష్టయ్య చిత్రపటానికి ముదిరాజ్ సంఘ సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల ముదిరాజ్ కమిటీ అధ్యక్షులు బుగుడాల నవీన్ కుమార్, ఉపాధ్యక్షులు మార్గం పండరి, సెక్రెటరీ వడగమ దేవేందర్, కోశాధికారి రాములు అన్నారం, తదితరులు పాల్గొన్నారు.