byసూర్య | Sat, Dec 02, 2023, 08:36 AM
భిక్కనూరు మండల కేంద్రంలో గల సిద్ధిరామేశ్వర ఆలయంలో ఉన్నటువంటి కోడెలకు వరిగడ్డిని శుక్రవారం వితరణ చేశారు. మండలంలోని పెద్దమల్లారెడ్డి గ్రామానికి చెందిన నీల లింగం అనే రైతు ట్రాక్టర్ గడ్డిని ఆలయానికి తీసుకువచ్చారు.ఆయన మాట్లాడుతూ, ఆలయంలో పెంచుతున్న కోడెలకు వరిగడ్డిని పెట్టాలని సూచించారు. అనంతరం ఆలయ పునర్నిర్మాణ కమిటీ అధ్యక్షులు మహేందర్రెడ్డి వరిగడ్డి దాత లింగమును అభినందించారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు.