byసూర్య | Sat, Dec 02, 2023, 08:35 AM
ఎయిడ్స్ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు ఆదర్శ్ హేమీమా అన్నారు. శుక్రవారం భిక్కనూరు మండల కేంద్రంలో ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలోని ప్రధాన వీధుల గుండా వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బంది పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎయిడ్స్ వ్యాధికి ఎలాంటి మందులు లేవని నివారణ ఒక్కటే మార్గం అన్నారు.