byసూర్య | Sat, Dec 02, 2023, 08:30 AM
ఇన్స్పైర్ సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా శుక్రవారం కామారెడ్డి పట్టణంలోని ఎస్సార్కే డిగ్రీ, పీజీ కళాశాలలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. సంస్థ నిర్వాహకులు అమృత రాజేందర్ మాట్లాడుతూ, హెచ్ఐవి ఎయిడ్స్ పట్ల అవగాహన ముఖ్యమని ఈ వ్యాధిని అరికట్టడానికి మందులు ఉన్నాయన్నారు. హెచ్ఐవితో జీవిస్తున్న వారికి భరోసా కల్పిస్తే పూర్తిగా నివారించవచ్చు అన్నారు.