byసూర్య | Sat, Dec 02, 2023, 08:28 AM
మహబూబ్ నగర్ జిల్లా భూత్పుర్ మండలం ఏవీఆర్ తండా సమీపంలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. నల్ల టీ-షర్టు, నల్ల ప్యాంట్ దరించిన(30)ఏళ్ల వ్యక్తి నడుచుకుంటూ వెళ్తుండగా శ్రీశైలం నుంచి వస్తున్న ఆర్టీసీ బస్ ఢీకొట్టడంతో మృతి చెందినట్లు భూత్పూర్ ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆచూకీ తెలిసిన వారు తమను సంప్రదించాలని ఎస్ఐ కోరారు.