సీతారామచంద్ర స్వామి ఆలయంలో గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ప్రత్యేక పూజలు

byసూర్య | Fri, Oct 25, 2024, 12:18 PM

భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ  దర్శించుకున్నారు. ప్రధానాలయంలోని ధ్రువమూర్తులను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.ఆ తర్వాత ఆలయానికి అనుబంధంగా ఉన్న ఆంజనేయస్వామి, లక్ష్మీ తాయారు అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం పలికారు. ఈవో రమాదేవి స్వామివారి చిత్రపటం, ప్రసాదాలను గవర్నర్‌కు అందజేశారు. అంతకుముందు గవర్నర్‌కు జిల్లా కలెక్టర్‌ జితేశ్‌ వీ పాటిల్‌, ఐటీడీఏ పీవో రాహుల్‌ స్వాగతం పలికారు.


 


 


Latest News
 

కాంగ్రెస్ అంటేనే రైతు ప్రభుత్వం: ఎమ్మెల్యే Fri, Oct 25, 2024, 12:59 PM
హైదరాబాదులో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగోతం..ప్రజల ప్రాణాలతో చెలగాటం Fri, Oct 25, 2024, 12:41 PM
స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా పని చేయాలి Fri, Oct 25, 2024, 12:22 PM
సీతారామచంద్ర స్వామి ఆలయంలో గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ప్రత్యేక పూజలు Fri, Oct 25, 2024, 12:18 PM
మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు Fri, Oct 25, 2024, 12:09 PM