byసూర్య | Fri, Dec 01, 2023, 07:20 PM
తెలంగాణలో ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. డిసెంబర్ 3 ఓట్ల లెక్కింపు చేపట్టనుండగా.. జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ల్లో ఈవీఎంలను భద్రపరిచారు. ఓట్ల లెక్కింపు కోసం అన్ని జిల్లా కేంద్రాల్లో కౌంటింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో పలు విద్యా సంస్థలు, కార్యాలయాల్లో ఈ లెక్కింపు కేంద్రాలను రెడీ చేస్తున్నారు. ఇక స్ట్రాంగ్ రూమ్ల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఈవీఎంలు భద్రపరిచిన గదుల వద్దకు ఎవరినీ అనుమతించడం లేదు. ఓ డీసీపీ స్థాయి అధికారి ఇద్దరు సీఐలు, నలుగులు ఎస్ఐలతో పాటు కేంద్ర బలగాలు పహారా కాస్తున్నాయి. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమయ్యే వరకు ఆయా గదుల వద్ద ఆంక్షలతో పాటు 144 సెక్షన్ విధించారు.