byసూర్య | Wed, Nov 29, 2023, 08:05 AM
జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి శివారులోని సుంకేసుల జలాశయానికి మంగళవారం 4200 క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తోంది. టీబీ డ్యామ్ నుంచి నీటిని విడుదల చేయడంతో ఇన్ ఫ్లో వస్తున్నట్లుగా జేఈ రాజు తెలిపారు. దీంతో జలాశయంలో 1. 19 టీఎంసీల నీటిని నిల్వ ఉంచుతూ, 1 గేట్ ద్వారా 1400 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లుగా తెలిపారు. 292, 00 మీటర్ల గరిష్ఠ నీటిమట్టం, డ్యాంలో ప్రస్తుతం 291. 90 మీటర్ల నీటిమట్టం నమోదైంది.