బీఆర్ఎస్ గెలవబోతోందని సర్వేలో తేలిందంటూ వార్తలు,,,బూటకమన్న బండ్ల గణేశ్

byసూర్య | Tue, Nov 28, 2023, 10:08 PM

తెలంగాణ ఎన్నికలకు సంబంధించి లగడపాటి రాజగోపాల్ సర్వే చేయించారని... బీఆర్ఎస్ పార్టీ మరోసారి గెలవబోతోందని, కేసీఆర్ ముఖ్యమంత్రిగా హ్యాట్రిక్ కొట్టబోతున్నారని సర్వేలో తేలిందనే వార్త వైరల్ అవుతోంది. బీఆర్ఎస్ కు 67 నుంచి 72 సీట్లు వస్తాయని, కాంగ్రెస్ కు 39 నుంచి 44 వరకు వస్తాయని, బీజేపీకి 4 నుంచి 6 వరకు, ఎంఐఎంకు 7 స్థానాలు, ఇతరులు రెండు చోట్ల గెలుస్తారని సర్వేలో తేలిందనే ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై సినీ నటుడు బండ్ల గణేశ్ స్పందించారు. తాను లగడపాటి రాజగోపాల్ తో మాట్లాడానని... ఆ సర్వేలకు, తనకు సంబంధం లేదని ఆయన చెప్పారని వెల్లడించారు. ఈ వార్తలన్నీ బూటకమని చెప్పారు.



Latest News
 

స్థానిక సంస్థల ఎన్నికల ఓటర్ జాబితా పరిశీలన Fri, Sep 20, 2024, 03:13 PM
మహమ్మద్ ప్రవక్త గొప్ప వ్యక్తి: ఎమ్మెల్యే కెపి.వివేకానంద్... Fri, Sep 20, 2024, 03:04 PM
ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్ Fri, Sep 20, 2024, 02:54 PM
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే Fri, Sep 20, 2024, 02:52 PM
ముందస్తు అరెస్టు చేయడం దారుణం Fri, Sep 20, 2024, 02:47 PM