ఎన్నికల వేళ విద్యార్థులకు 2 రోజుల సెలవులు,,,ఉద్యోగులకు పెయిడ్ హాలిడే

byసూర్య | Tue, Nov 28, 2023, 06:45 PM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో విద్యా సంస్థలకు అధికారులు రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. నవంబర్ 30వ తేదీన పోలింగ్ జరగనుండగా.. బుధ, గురువారాల్లో విద్యాసంస్థలకు తెలంగాణ ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఈమేరకు హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ ఉత్తర్వులు జారీ చేశారు. నగరంలోని పలు విద్యాసంస్థల్లో పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. బుధవారం ఆయా పోలింగ్‌ కేంద్రాలకు ఎన్నికల సామగ్రిని తరలించన్నారు. ఈ నేపథ్యంలో విద్యాసంస్థలకు 2 రోజుల పాటు సెలవు ప్రకటించారు.


మరోవైపు.. పోలింగ్ రోజున ఉద్యోగులందరికి పెయిడ్ హాలిడే ప్రకటించాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. అన్ని ప్రైవేటు సంస్థలు, ఐటీ సంస్థలు, పరిశ్రమలు విధిగా సెలవు ప్రకటించి.. ఉద్యోగులంతా ఓటు హక్కు వినియోగించుకునేందుకు సహకరించాలని సీఈవో వికాస్ రాజ్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలను పాటించకపోతే చట్టరిత్యా కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. కాగా.. ఇప్పటికే కొన్ని కంపెనీలు పోలింగ్ రోజున హాలిడే ప్రకటించగా.. ఈసీ ఆదేశాలతో మిగిలిన సంస్థలు కూడా ప్రకటించనున్నాయి. ఇదిలా ఉంటే.. మూడు రోజుల పాటు వైన్స్ బంద్‌ చేయాలంటూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ రోజు (నవంబర్ 28) 5 గంటల నుంచి 30 తారీఖు 5 గంటల వరకు మద్యం దుకాణాలు మూసేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాలు ఉల్లంఘించిన వారిపై చట్ట రిత్యా చర్యలు తీసుకుంటామని అధికారులు ఆదేశించారు.


Latest News
 

"ప్రజల గొంతుకగా పోరాటం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు" Fri, Nov 14, 2025, 04:38 PM
జూబ్లీహిల్స్ విజయంతో ఊపందుకున్న కాంగ్రెస్.. లోకల్ బాడీ ఎన్నికలకు సన్నాహం Fri, Nov 14, 2025, 04:30 PM
రేవంత్ రాజకీయ చాణక్యం.. కాంగ్రెస్‌లో సీనియర్ల సవాల్‌ను సైలెంట్‌గా తిప్పికొట్టిన సీఎం Fri, Nov 14, 2025, 04:26 PM
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో జయకేతనం ఎగురవేసిన కాంగ్రెస్ Fri, Nov 14, 2025, 04:13 PM
జూబ్లీహిల్స్ విజయం ప్రజాపాలనకు నిదర్శనం : ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య Fri, Nov 14, 2025, 03:50 PM