byసూర్య | Tue, Nov 28, 2023, 01:29 PM
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్ చేయనున్నారు. మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మద్యం విక్రయాలు నిలిపివేయనున్నారు. ఈ విషయమై వైన్స్, బార్ల యజమానులకు కేంద్ర ఎన్నికల సంఘం ముందస్తు సమాచారం అందించింది.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని మద్యం దుకాణాల యజమానులను రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అప్రమత్తం చేసింది. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు.. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను పాటించకుంటే.. లైసెన్సుల రద్దుతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.