byసూర్య | Tue, Nov 28, 2023, 01:29 PM
జనగణన చేయలేమని సుప్రీంకోర్టుకు తెలిపి బిజెపి చేతులెత్తేసిందని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ అన్నారు. సోమవారం కామారెడ్డిలో ఆయన మాట్లాడారు. కామారెడ్డిలో సీఎం కేసీఆర్ గెలుపునకు అనుకూల పరిస్థితులు ఉన్నాయన్నారు. ముదిరాజుల్లో అవకాశం ఉన్నవారికి రాజకీయంగా బి. ఆర్. ఎస్ అవకాశాలు కల్పించిందని తెలిపారు. జనగణన చేపడితే రిజర్వేషన్లకు అనుకూలంగా ఉంటుందన్నారు. కెసిఆర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు.