byసూర్య | Tue, Nov 28, 2023, 01:31 PM
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు సాగించిన హోరాహోరీ ప్రచారంలో మైకుల మోతకు మంగళవారం సాయంత్రం 5 గంటలకు బ్రేకులు పడనున్నాయి. పోలింగ్ ముగింపుకు 48 గంటల ముందు ప్రచారం ముగించాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేయడంతో పార్టీల ప్రచారానికి ఇక తెరపడనుంది. ఈ నెల 30న పోలింగ్ జరగనుండగా, డిసెంబర్ 3వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలవడనున్నాయి. ప్రధాన పార్టీల అభ్యర్థుల భవితవ్యం అదే రోజే తేలనుంది.