byసూర్య | Wed, Nov 22, 2023, 11:55 AM
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో బుధవారం పత్తి, మిర్చీ ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చీ ధర రూ. 24, 200 జెండా పాట పలకగా, కొత్త మిర్చీ ధర రూ. 22, 011జెండాపాట పలికింది. క్వింటా పాత పత్తి ధర రూ. 6, 650, కొత్త పత్తి ధర రూ. 6, 700 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటి కంటే ఈ రోజు ఏసీ మిర్చీ ధర రూ. 100, కొత్త పత్తి ధర రూ. 50 తగ్గగా, కొత్త మిర్చీ ధర రూ. 895 పెరిగినట్లు తెలిపారు.