byసూర్య | Wed, Nov 22, 2023, 11:53 AM
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డా. చిట్టెం పర్ణిక రెడ్డి అన్నారు. బుధవారం దామరగిద్ద మండలం గత్ప గ్రామంలో ఎన్నికల ప్రచారం చేశారు. ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. పేద మహిళలకు నెలకు రూ. 2500 ఇస్తామని, వంట గ్యాస్ 5రూ. 500 లకు అందిస్తామని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలను, నిరుద్యోగులను మోసం చేసిన బీఆర్ఎస్ పార్టీని ఓడించాలని అన్నారు.