byసూర్య | Wed, Nov 22, 2023, 11:57 AM
కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే కారుచీకట్లు తప్పవని ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి సతీమణి స్వాతి రెడ్డి అన్నారు. బుధవారం నారాయణపేట పట్టణంలోని 11వ వార్డులో కూతురు నందిక రెడ్డితో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు. ఇంటింటికీ స్వచ్ఛమైన మిషన్ భగీరథ త్రాగు నీరు అందిస్తున్నామని, అభివృద్ధిని చూసి ఓటు వేయాలని ఓటరుకు చెప్పారు. అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిన బీఆర్ఎస్ పార్టీని ఆదరించాలని కోరారు.