byసూర్య | Wed, Nov 22, 2023, 12:23 PM
పటాన్చెరు : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం బిజెపి తెల్లాపూర్ మున్సిపల్ అధ్యక్షులు కోటే శంకర్, భారతి నగర్ డివిజన్ అధ్యక్షులు మన్నె శ్రీకాంత్, జిన్నారం మండల అధ్యక్షుడు బండి శ్రీకాంత్ తదితరులు పటాన్చెరు శాసనసభ్యులు, బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. హాజరైన భారతి నగర్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి, సీనియర్ నాయకులు శ్రీకాంత్ గౌడ్, తదితరులు.మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణం చేయడం గ్యారెంటీ అన్నారు పఠాన్ చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. పఠాన్చెరు ప్రజలు తనను అత్యధిక మెజార్టీ ఇచ్చి ఆశీర్వదిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్న గూడెం మహిపాల్ రెడ్డి.