byసూర్య | Wed, Nov 22, 2023, 11:49 AM
సంగారెడ్డి మండలం గుడి తాండ గ్రామంలోని కాంగ్రెస్ నాయకులు పలువురు బీఆర్ఎస్ లో బుధవారం చేరారు. డిసిసిబి ఉమ్మడి జిల్లా వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం గ్రామంలోని ప్రచారం కొనసాగించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి సభ్యుడు మనోహర్ గౌడ్, నాయకులు పాల్గొన్నారు.