byసూర్య | Wed, Nov 22, 2023, 11:40 AM
బీర్పూర్ మండలం కందనకుంట గ్రామానికి చెందిన బిఆర్ఎస్ ఉప సర్పంచ్ ఎదుల లావణ్య, ఒడ్డెర కాలనీకి చెందిన 60 మంది యువకులు మహిళలు బీర్పూర్ మండల అధ్యక్షులు మ్యాడా జనార్దన్ ఆధ్వర్యంలో బుధవారం భారతీయ జనతా పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే అభ్యర్థి డా. బొగ శ్రావణి కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జెనరల్ సెక్రటరీ ఆడెపు రమేష్, ప్రధాన కార్యదర్శి అప్పల జెలెందర్ పాల్గొన్నారు.