byసూర్య | Wed, Nov 22, 2023, 11:15 AM
యాదాద్రి లక్ష్మీ నృసింహస్వామి సన్నిధిలో మంగళవారం సహస్రనామార్చన శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామి, అమ్మవార్ల సహస్రనామ పఠనాలతో అర్చక బృందం, వేద పండితులు వివిధ రకాల పూలతో పూజలు నిర్వహించారు. పాంచరాత్రాగమ శాస్త్ర ప్రకారం సుమారు గంటలపాటు అర్చన పర్వాలు కొనసాగాయి. ఇందులో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు