byసూర్య | Wed, Nov 22, 2023, 10:57 AM
మంత్రి, పాలకుర్తి బీఆర్ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు నిరసన తగిలింది. కొడకండ్ల మండలం రేగుల తండాలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఎర్రబెల్లిని తండావాసులు ఆడుకున్నారు. తమ తండా సమస్యలు పరిష్కరించలేదన్నారు. జై కాంగ్రెస్, జై ఝాన్సీ రెడ్డి అంటూ నినాదాలు చేశారు. దీంతో ఎర్రబెల్లి ఎన్నికల ప్రచారం చేయకుండానే వెనుదిరిగి వెళ్లిపోయారు.
తెలంగాణ లో ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేసిన సీఎం కేసీఆర్.. నేడు నాలుగు ప్రజాశీర్వాద బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. తాండూరు, కొండగల్, మహబూబ్ నగర్, పరిగిలో కేసీఆర్ సభలు నిర్వహించనున్నారు. ఈ సభల్లో పాల్గొనేందుకు భారీ జనసమీకరణ దిశగా స్థానిక BRS శ్రేణులు సమాయత్తం అవుతుంది.