byసూర్య | Wed, Nov 22, 2023, 10:49 AM
ఈ నెల 25వ తేదీన పరేడ్ గ్రౌండ్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ ఏర్పాట్లను మంగళవారం సనత్ నగర్ నియోజకవర్గ అభ్యర్థి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. సభలో ఎలాంటి అవాంతరాలు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. టి ఎస్ ఐ ఐ సి చైర్మన్ గ్యాదరి బాలమల్లు, బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నగేష్, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.