తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో మల్లికార్జున ఖర్గే

byసూర్య | Wed, Nov 22, 2023, 09:46 AM

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. నేడు రెండు నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు. మధ్యాహ్నం 1.40 గంటలకు జోగులాంబ జిల్లా ఆలంపూర్‌లో, సాయంత్రం 4.30 గంటలకు నల్గొండ బహిరంగసభల్లో కాంగ్రెస్ హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు.


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వారం రోజులే గడువు ఉండటంతో అన్ని పార్టీల అగ్రనేతలు క్యాంపెయిన్‌ను ఉద్ధృతం చేశారు. ఈ క్రమంలో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి నేడు 5 నియోజకవర్గాల్లో పర్యటించున్నారు. నిజామాబాద్ రూరల్, నారాయణఖేడ్, గజ్వేల్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొననున్నారు. నిజామాబాద్ రూరల్, నారాయణఖేడ్, గజ్వేల్‌లలో బహిరంగసభలుండగా.. కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో రోడ్‌షోలు ఉండనున్నాయి.


గడీల పాలన పోవాలి.. ప్రజాపాలన రావాలని ట్విట్టర్ వేదికగా టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ‘‘అచ్చంపేటలో చీమలదండుగా కదలివచ్చిన మిమ్మల్ని చూస్తోంటే.. 50వేల మెజారిటీతో వంశీ గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. నియోజకవర్గంలో గువ్వల బాలరాజు రౌడీమూక ప్రజలపై దాడి చేస్తున్నా ఇన్నాళ్లూ ఓపికగా ఉన్నాం. ఇక నల్లమల బిడ్డలకు ఓపిక నశించింది. ప్రజలు తలుచుకుంటే కేసీఆర్ గడీ నేలమట్టమవుతుంది’’ అని ట్వీట్ చేశారు.


Latest News
 

దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిపై.. హెచ్‌ఎండీకే హైకోర్టు నోటీసులు జారీ Fri, Sep 20, 2024, 08:34 PM
పాస్ పోర్ట్ సేవా కేంద్రం ఏర్పాటు చేయించాలని వినతి Fri, Sep 20, 2024, 08:30 PM
ఓఆర్ఆర్‌పై కొత్తగా మరో మూడు ఇంటర్‌చేంజ్‌లు.. ఆ ప్రాంతాల్లో ఏర్పాటు Fri, Sep 20, 2024, 08:19 PM
పేదలకు రేవంత్ సర్కారు తీపి కబురు... పది రోజుల్లోనే విధివిధానాలు ఖరారు Fri, Sep 20, 2024, 08:17 PM
నేడు తెలంగాణ క్యాబినెట్ భేటీ.. ‘హైడ్రా’ ఆర్డినెన్స్‌తో ఇవే ప్రధాన ఎజెండా Fri, Sep 20, 2024, 08:15 PM