byసూర్య | Wed, Nov 22, 2023, 09:39 AM
అశ్వారావుపేట మండలంలోని నందిపాడు గ్రామానికి చెందిన పద్దం శ్రీను కుమారుడు ఫ్లెమింగ్ (16) హైదరాబాద్ దుర్గంచెరువు పరిధిలోని ఓ కార్పొరేట్ ఫ్లెమింగ్ (ఫైల్) కళాశాలలో బైపీసీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. మంగళవారం ఫ్లెమింగ్ ఆత్మహత్యకు పాల్పడినట్లు తండ్రి శ్రీనుకు పోలీసులు సమాచారం అందించారు. కాగా మృతుడి తల్లి నాగమణి కరోనా సమయంలో మృతిచెందారు. ఫ్లెమింగ్ మృతికి కారణాలు తెలియాల్సి ఉంది.