byసూర్య | Wed, Nov 22, 2023, 09:25 AM
సీఎం కేసీఆర్తో పోటీ చేసే రోజు వస్తుందని ఊహించలేదని బీజేపీ నేత హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొని మాట్లాడారు. ఒక స్థానం నుంచి పోటీ చేస్తానని బీజేపీ నాయకత్వాన్ని కోరాను. నా మీటింగ్కి వెళ్లవద్దని బీఆర్ఎస్ డబ్బులు చెల్లిస్తోంది. హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ రూ.6వందల కోట్లు ఖర్చుపెట్టింది. 20 ఏళ్లలో ఏ నాయకుడితోనూ గొడవ పడలేదు’’ అని ఈటల అన్నారు.
నేను కులపరంగా ఎదగలేదు, ఉద్యమబిడ్డగా ఎదిగాను అని ఈటల రాజేందర్ అన్నారు. నేను ఫైటర్ కాబట్టే. కేసీఆర్ నాకు అవకాశమిచ్చారని ఓ ఇంటర్వ్యూ లో పాల్గొని మాట్లాడారు. 'ఏ పదవి ఇచ్చినా. ఆ పదవికి వన్నె తెచ్చాను. ఏ పోరాటాలతో తెలంగాణ వచ్చిందో, ఆ పోరాటాల్నే కేసీఆర్ వద్దన్నారు. 2017లో నాకు, కేసీఆర్కు కొట్లాట మొదలైంది. నేను భూకబ్జా చేసినట్టు, ఒకరి దగ్గర డబ్బు తీసుకున్నట్టు నిరూపించండి. నాపై 365 రోజులు. 360 డిగ్రీల్లో పూర్తి నిఘా ఉంటుంది." అని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు.