ప్రచారంలో దూకుడు పెంచిన సీఎం కేసీఆర్,,,పలు చోట్ల ప్రజా ఆశీర్వాద సభ

byసూర్య | Tue, Nov 21, 2023, 07:39 PM

బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ప్రచారంలో జోరు పెంచారు. పోలింగ్ తేదీ దగ్గరపడుతుండంతో ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇవాళ నాలుగు ప్రజాశీర్వాదసభల్లో పాల్గొంటున్నారు. మధిర, వైరా, డోర్నకల్, సూర్యాపేట బహిరంగ సభలలో పాల్గొని ప్రజలనుద్దేశించి మాట్లాడనున్నారు. ఈ క్రమంలోనే ఎన్నికల ప్రచారంలో గులాబీ బాస్, సీఎం కేసీఆర్ టాప్‌ గేర్‌లో దూసుకుపోతున్నారు. హాట్రిక్ విజయమే లక్ష్యంగా నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. పోలింగ్‌కు సమయం దగ్గర పడుతుండటంతో ప్రచారంలో మరింత జోరు పెంచారు. రోజూ 3-4 నియోజకవర్గాల్లో ప్రజాశీర్వాద బహిరంగసభల్లో పాల్గొంటూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు మధిర, వైరా, డోర్నకల్, సూర్యాపేట బహిరంగ సభలలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. 


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM