![]() |
![]() |
byసూర్య | Tue, Nov 21, 2023, 07:39 PM
బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ప్రచారంలో జోరు పెంచారు. పోలింగ్ తేదీ దగ్గరపడుతుండంతో ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇవాళ నాలుగు ప్రజాశీర్వాదసభల్లో పాల్గొంటున్నారు. మధిర, వైరా, డోర్నకల్, సూర్యాపేట బహిరంగ సభలలో పాల్గొని ప్రజలనుద్దేశించి మాట్లాడనున్నారు. ఈ క్రమంలోనే ఎన్నికల ప్రచారంలో గులాబీ బాస్, సీఎం కేసీఆర్ టాప్ గేర్లో దూసుకుపోతున్నారు. హాట్రిక్ విజయమే లక్ష్యంగా నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. పోలింగ్కు సమయం దగ్గర పడుతుండటంతో ప్రచారంలో మరింత జోరు పెంచారు. రోజూ 3-4 నియోజకవర్గాల్లో ప్రజాశీర్వాద బహిరంగసభల్లో పాల్గొంటూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు మధిర, వైరా, డోర్నకల్, సూర్యాపేట బహిరంగ సభలలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు.