byసూర్య | Tue, Nov 21, 2023, 02:31 PM
బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ కోసమని సీఎం కేసీఆర్ అన్నారు. మధిరలో ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. ‘‘దేశానికే అన్నపూర్ణగా తెలంగాణ తయారైంది. ప్రతి ఇంటికి మంచినీరు ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. చిత్తశుద్ధితో పనిచేస్తే విజయాలు సాధ్యమవుతాయి. ఎన్నికల్లో అభ్యర్థులతో పాటు వారి పార్టీల చరిత్రను చూసి ఓటు వేయాలి’’ అని ప్రజలకు కేసీఆర్ సూచించారు.
మధిర సిట్టింగ్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్కపై బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ మండిపడ్డారు. మధిరలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ప్రజా ఆశ్వీరాద సభలో కేసీఆర్ మాట్లాడారు. భట్టి విక్రమార్క మధిర నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదన్నారు. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 20 సీట్లే గెలుస్తుందని జోస్యం చెప్పారు. మధిరలో భట్టి ఓడిపోవడం ఖాయం అన్నారు.
మధిర సిట్టింగ్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్కపై బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ మండిపడ్డారు. మధిరలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ప్రజా ఆశ్వీరాద సభలో కేసీఆర్ మాట్లాడారు. భట్టి విక్రమార్క మధిర నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదన్నారు. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 20 సీట్లు గెలవదని జోస్యం చెప్పారు. మధిరలో భట్టి ఓడిపోవడం ఖాయం అన్నారు.