byసూర్య | Tue, Nov 21, 2023, 02:11 PM
మధిర సిట్టింగ్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్కపై బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ మండిపడ్డారు. మధిరలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ప్రజా ఆశ్వీరాద సభలో కేసీఆర్ మాట్లాడారు. భట్టి విక్రమార్క మధిర నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదన్నారు. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 20 సీట్లు గెలవదని జోస్యం చెప్పారు. మధిరలో భట్టి ఓడిపోవడం ఖాయం అన్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. ఈక్రమంలో గులాబీ బాస్ కేసీఆర్ ప్రజా ఆశీర్వద సభల్లో తన ప్రచారంలో పదును పెంచారు. ఓవైపు తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులతో పాటు ప్రతిపక్షాలపై కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. అయితే.. ఈరోజు నల్గొండ జిల్లాలో పర్యటించిన కేసీఆర్.. నకిరేకల్ నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఈ సభలో ప్రసంగించిన కేసీఆర్.. కమ్యూనిస్టు నేతలకు ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్యకు కమ్యూనిస్టు సోదరులంతా మద్దతు ఇవ్వాలని గులాబీ బాస్ కోరారు.