కాంగ్రెస్‌ను నమ్మితే ఆగమవుతాం: హరీశ్‌రావు

byసూర్య | Tue, Nov 21, 2023, 01:30 PM

కాంగ్రెస్‌ను నమ్మితే మళ్లీ ఆగమవుతామని రాష్ట్రమంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఆయన రోడ్‌ షో నిర్వహించారు. మూడు గంటల కరెంట్ ఇస్తే 3ఎకరాలు పారుతుందని రేవంత్‌, రైతుబంధు పెట్టి దుబారా ఖర్చు చేస్తున్నారని ఉత్తమ్‌ అంటున్నారని చెప్పారు. కాంగ్రెస్‌ గెలిస్తే రైతుబంధు జీరో అవుతుందని హెచ్చరించారు. వంద అబద్ధాలు ఆడైనా కుర్చీ సాధించాలనేదే కాంగ్రెస్ విధానమని హరీశ్‌రావు ఆరోపించారు.


బీజేపీ నాయకులు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని దుబ్బాకలో మంత్రి హరీష్‌రావు అన్నారు. 'బీజేపీపై సొంత పార్టీ నాయకులకే నమ్మకం లేదు.. బీజేపీ తెలంగాణలో గెలవదని తెలిసి రోజుకో నాయకుడు పార్టీ వీడుతున్నారు. విజయశాంతి, వివేక్, రాజగోపాల్ రెడ్డి, చంద్రశేఖర్ లాంటి నాయకులు పార్టీకి టాటా చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ఇచ్చిన 5 గ్యారెంటీలు నెరవేర్చలేదు.. కానీ, ఇక్కడ 6 గ్యారెంటీలు అంటోంది' అని అన్నారు.


Latest News
 

మొయినాబాద్ కోడి పందేల కేసులో స్వాధీనం చేసుకున్న కోళ్లను వేలం వేసిన కోర్టు Tue, Feb 18, 2025, 10:48 AM
జోన్-3 సివర్ నెట్ వర్క్ ప్రాజెక్టు పనుల పరిశీలన Tue, Feb 18, 2025, 10:43 AM
హైడ్రా తీరుపై హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం Tue, Feb 18, 2025, 10:39 AM
పెద్దగట్టు జాతరకు పోటెత్తిన భక్తులు Tue, Feb 18, 2025, 10:19 AM
అక్రమ ఇసుక రవాణా ఆపేదెలా? Mon, Feb 17, 2025, 09:02 PM