byసూర్య | Tue, Nov 21, 2023, 01:27 PM
బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఎంపీ కాక ముందే తాను పోరాటాలు చేస్తూ ఐదుసార్లు జైలుకు వెళ్లానని చెప్పారు. కరీంనగర్లో నిర్వహించిన పద్మశాలీ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్ పాలనలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని విమర్శించారు. ప్రజా పాలన రావాలంటే రాష్ట్రంలో బీజేపీనే అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు.