![]() |
![]() |
byసూర్య | Tue, Nov 21, 2023, 01:13 PM
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం, వంగూరు మండలం పరిధిలోని పలు గ్రామాల్లో రైతులు సాగుచేసిన వేరుశనగ పంటకు వేరుకుళ్ళు తెగులు సోకిందని దీని నివారణకు, సిఓసి అనే రసాయన మందును 600 మిల్లీ లీటర్లు మొక్క వేరు తడిచే విధంగా పిచికారి చేయాలని మండల వ్యవసాయ శాఖ అధికారి తనూజ మంగళవారం రైతులకు సూచించారు. అదనపు సమాచారం, సూచనల కోసం వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించాలని కోరారు.