byసూర్య | Tue, Nov 21, 2023, 12:43 PM
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గం కేంద్రంలో సోమవారం జరిగిన రోడ్ షోలో ముఖ్య అతిధిగా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అమలు కావాలంటే కారు గుర్తుకు ఓటు వేసి బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావును అధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో ప్రజలు హాజరైనారు.